అక్కచెల్లెమ్మలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఆస్తి

Best Web Hosting Provider In India 2024

ఇళ్ల లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌

12.77 లక్షల మందికి రూ.4500 కోట్ల బ్యాంకు రుణాలు

ఈ దఫా 4,07,323 మందికి వడ్డీ రీయింబర్స్‌మెంట్‌

వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.80 కోట్లు జమ

ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల మేర లబ్ధి

ప్రతి ఇంటిపై మౌలిక వసతులకు లక్షకు పైగా ఖర్చు

 తాడేపల్లి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్లు కట్టుకుంటున్న అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రుణాలు అందజేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఒక ఆస్తిని ఇచ్చి ఒక మంచి అన్నగా, తమ్ముడిగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అక్కచెల్లె­మ్మ­లపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను గురువారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి సీఎం వైయ‌స్‌ జగన్‌ బటన్‌ నొక్కి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు.  

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గన్ ఏమ‌న్నారంటే..

  • దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కచెల్లె­మ్మ­లపై భారం పడకుండా పావలా వడ్డీకే రుణాలు అందిస్తూ ఆపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. తొలి దఫా అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.46.90 కోట్లను విడుదల చేస్తున్నాం.
  • ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరుగుతోంది. గతంలో 5.23 లక్షల మందికి ఈ కార్యక్రమం కింద రూ.54 కోట్లు ఇచ్చాం. ఈ రోజు 4.23 లక్షల మందికి రూ.47 కోట్లు విడుదల చేస్తున్నాం.
  • పావలా వడ్డీకే ఇలా ఇస్తూ ప్రతి అక్కచెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వాళ్ల ఇళ్ల నిర్మాణాల వేగవంతం చేస్తున్నాం.
  • ఒకసారి గమనిస్తే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశ దేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఏకంగా 31.19 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు ఇవ్వగలిగాం. అందులో ఇప్పటికే 22.25 ల క్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరుగుతుంది.
  • ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు అవుతుంది. మరో లక్ష అధనంగా అవుతుంది. దాదాపుగా రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. రూ.1.85 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో 35 వేలు పావలా వడ్డీకే ఇస్తున్నాం. ఉచితంగా ఇసుక ఇస్తున్నాం.  ఇవి కాకుండా మరో రూ.40 వేలు వివిధ వస్తువులపై ఉచితంగా అందజేస్తున్నాం.
  • ఒకవైపు  ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మనం ఇచ్చిన ఒక్కో ఇంటి స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి కనీసం రూ.2.50 లక్షలతో మొదలుపెడితే రూ.20 లక్షల దాకా ఉంది. ఇవన్నీ కలిపి దాదాపుగా ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల దాకా ఒక ఆస్తిని ఒక మంచి అన్నగా, తమ్ముడిగా రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఇచ్చేందుకు దేవుడు నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది.
  • అందులో భాగంగా ఈ ధపా సున్నా వడ్డీ కింద రూ.47 వేల కోట్లు ఇస్తున్నాం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న అక్కచెల్లెమ్మలకు సక్రమంగా చెల్లించాలి. ఇది వాళ్ల బాధ్యత. వాళ్లు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వాళ్లకు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వంగా మన కార్యక్రమం చేపడుతున్నాం. ఇది మంచి కార్యక్రమం. దీన్ని ముందుకు తీసుకెళ్దామని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి పావలా వడ్డీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 
     

Best Web Hosting Provider In India 2024