Best Web Hosting Provider In India 2024
22 Jun 2024 10:27 PM

పులివెందులలో ఎలాంటి రాళ్ల దాడి జరగలేదు: డీఎస్పీ
వైయస్ఆర్ జిల్లా: పులివెందులలో వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విష ప్రచారానికి ఒడిగట్టింది. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని పోలీస్ అధికారులు ఖండించారు. పులివెందులలో వైయస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహిస్తుండగా, కార్యకర్తల తోపులాటలో కిటికీ అద్దాలు పగిలాయని.. ఎటువంటి రాళ్లదాడి జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు
పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి నినాదాలు చేయలేదని.. కేవలం వైయస్ జగన్ను చూడడానికి ప్రజలు తరలిరావడంతో తోపులాట జరిగిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ రెడ్డి తెలిపారు.