శుభాన్షు శుక్లా ఆక్సియమ్ 4 మిషన్ భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమైనది?

Best Web Hosting Provider In India 2024


శుభాన్షు శుక్లా ఆక్సియమ్ 4 మిషన్ భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమైనది?

Anand Sai HT Telugu

అనేకసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు ఆక్సియమ్ 4 మిషన్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆక్సియమ్ 4 మిషన్ భారతదేశానికి ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకుందాం..

శుభాన్షు శుక్లా

నాసా ప్రకటన ప్రకారం ఆక్సియమ్ 4 మిషన్ జూన్ 25న ఉంటుంది. ఈ మిషన్‌లో భారతదేశం, హంగేరీ, పోలాండ్ నుండి వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరుతారు. ఈ నాసా మిషన్ భారతదేశానికి కూడా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ మిషన్‌లో చాలా కాలం తర్వాత ఒక భారతీయ వ్యోమగామి ఐఎస్‌ఎస్‌కి వెళ్తున్నారు. భారతదేశ వ్యోమగామి శుభాన్షు శుక్లా ఈ మిషన్‌లో ఉన్నారు.

ఈ మిషన్‌ను ప్రారంభించే ముందు చాలాసార్లు వాయిదా వేసిన విషయం తెలిసిందే. నిరంతరం వాయిదా పడిన తర్వాత, ఇప్పుడు దీని కోసం అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ సమయంలో ప్రపంచం మొత్తం దృష్టి నాసా ఈ ఆక్సియమ్ 4 మిషన్ మిషన్ ప్రయోగంపై ఉంది.

ఆక్సియమ్ 4 మిషన్ గురించి భారతదేశం కూడా ఎంతగానే ఎదురుచూస్తోంది. వాస్తవానికి ఈ మిషన్ భారతదేశానికి కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దీని ద్వారా భారతదేశం అంతరిక్ష పరిశోధనలలో తన సామర్థ్యాన్ని పెంచుకోగలదు. అలాగే ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకోగలదు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు భారత్‌కు ఇది బూస్ట్ ఇవ్వనుంది.

ఆక్సియమ్ 4 మిషన్ కింద ఈ 3 దేశాల నుండి వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 60కి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల నుండి శాస్త్రవేత్తలు, సంస్థలు ఉంటాయి. 60 ప్రయోగాలు ఉమ్మడి సహకారంతో నిర్వహిస్తారు. ఇవి బయో సైన్స్, మానవ ఆరోగ్యం, అంతరిక్ష జీవిత వ్యవస్థ, అధునాతన సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి.

వీటిలో భారతదేశం నుండి 7 పరిశోధన ప్రాజెక్టులు, యూఎస్ నుండి 5 ఉన్నాయి. ఆక్సియమ్ 4 మిషన్‌లో శుభాన్షు శుక్లా భాగస్వామ్యం నుండి భారతదేశం ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఈ మిషన్ సమయంలో భారతదేశ గగన్‌యాన్ వ్యోమగాముల శిక్షణ, మిషన్ రూపకల్పనలో శుభాన్షు శుక్లా అనుభవం చాలా ఉపయోగకరం.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link