




Best Web Hosting Provider In India 2024

అల్పపీడనం ఎఫెక్ట్ – ఏపీలో 4 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు..!
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. అల్పపీడన ప్రభావంతో 4 రోజులపాటు పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఈ ప్రభావంతో ఏపీలో 4 రోజులపాటు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది.
ఈ జిల్లాలకు వర్ష సూచన…
రాష్ట్రంలోని పలుచోట్ల 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఇవాళ శ్రీకాకుళం,విజయనగరం,పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రేపు(జూన్ 27) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అల్లూరి, అనకాపలి జిలాల్లోల పిడుగులతో కూడిన తేలకిపాటి నుంచి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, కర్నూల్, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
శనివారం(జూన్ 28) రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూర సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడకక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు. మిగిలిన చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం రోజూ కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండొచ్చు.
ఇక నిన్న(జూన్ 25) సాయంత్రం 5 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లిలో 49మిమీ, విశాఖ రూరల్ లో 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లాలోని మునకుళ్ళలో 36.5మిమీ వర్షపాతం నమోదైంది.
టాపిక్