
Best Web Hosting Provider In India 2024

ఏపీలోని తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 9వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఫలితాలు ప్రకటన ఉంటుందని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ఉపఎన్నిక షెడ్యూల్
1.నోటిఫికేషన్ జారీ – నవంబర్ 11, 2024 (సోమవారం)
2.నామినేషన్లు వేయడానికి చివరి తేదీ – నవంబర్ 18, 2024 (సోమవారం)
3.నామినేషన్ల పరిశీలన- నవంబర్ 19, 2024 (మంగళవారం)
4. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 21 , 2024 (గురువారం)
5. పోలింగ్ తేదీ- డిసెంబర్ 05, 2024 (గురువారం)
6. పోలింగ్ సమయం – 08:00 am- 04:00 pm
7.ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 09, 2024 (సోమవారం)
8. ఎన్నికలు ముగించాల్సిన తేదీ-12 డిసెంబర్, 2024 (గురువారం)
టాపిక్