AP Teachers Mlc Elections : తూర్పు, పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల, డిసెంబర్ 5న పోలింగ్

Best Web Hosting Provider In India 2024

ఏపీలోని తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తూర్పుగోదావరి- పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ గతేడాది డిసెంబర్ 15న రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక వచ్చింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.

ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 19వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబర్‌ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 9వ తేదీన ఓట్ల కౌంటింగ్ ఫలితాలు ప్రకటన ఉంటుందని ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.

ఉపఎన్నిక షెడ్యూల్

1.నోటిఫికేషన్ జారీ – నవంబర్ 11, 2024 (సోమవారం)

2.నామినేషన్లు వేయడానికి చివరి తేదీ – నవంబర్ 18, 2024 (సోమవారం)

3.నామినేషన్ల పరిశీలన- నవంబర్ 19, 2024 (మంగళవారం)

4. నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ- నవంబర్ 21 , 2024 (గురువారం)

5. పోలింగ్ తేదీ- డిసెంబర్ 05, 2024 (గురువారం)

6. పోలింగ్ సమయం – 08:00 am- 04:00 pm

7.ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 09, 2024 (సోమవారం)

8. ఎన్నికలు ముగించాల్సిన తేదీ-12 డిసెంబర్, 2024 (గురువారం)

Whats_app_banner

టాపిక్

Ap Mlc ElectionsElection CodeAndhra Pradesh NewsTrending ApTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024