2026 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు; 10వ తరగతి పరీక్షావిధానంలో మార్పులకు సీబీఎస్ఈ ఆమోదం

Best Web Hosting Provider In India 2024


2026 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు; 10వ తరగతి పరీక్షావిధానంలో మార్పులకు సీబీఎస్ఈ ఆమోదం

Sudarshan V HT Telugu

10వ తరగతి బోర్డు పరీక్షా విధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం చుట్టింది. 2026 నుంచి 10 వ తరగతిలో ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు సీబీఎస్ఈ ఆమోదం తెలిపింది. మేలో జరిగే రెండో దశ పరీక్ష తమ పనితీరును మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు ఐచ్ఛికంగా ఉంటుంది.

2026 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు (Raj K Raj/HT Photo/Representational)

కొత్త జాతీయ విద్యావిధానం (NEP) 2020లో సిఫార్సు చేసిన 10వ తరగతికి సంవత్సరానికి రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించే నిబంధనలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం ఆమోదం తెలిపింది. దీని ద్వారా 2026 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు రెండుసార్లు సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాయవచ్చు.

ఫిబ్రవరి లో తప్పనిసరి, మేలో ఆప్షనల్

అయితే, ఫిబ్రవరిలో జరిగే మొదటి దశ పరీక్షలకు హాజరుకావడం తప్పనిసరి అని అధికారులు తెలిపారు. మేలో జరగనున్న రెండో దశ పరీక్షలు తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు ఐచ్ఛికంగా ఉంటుందని వారు తెలిపారు. మొదటి దశ ఫిబ్రవరిలో, రెండో దశ మేలో నిర్వహిస్తామని సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ తెలిపారు. రెండు దశల ఫలితాలను వరుసగా ఏప్రిల్, జూన్లో ప్రకటిస్తామని తెలిపారు. మొదటి దశ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని, రెండో దశ ఐచ్ఛికంగా ఉంటుందని తెలిపారు.

ఏవైనా మూడు సబ్జెక్టుల్లో..

సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో ఏదైనా మూడు సబ్జెక్టుల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చు. ఆమోదించిన నిబంధనల ప్రకారం, వింటర్ బౌండ్ స్కూల్స్ కు చెందిన 10 వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి లేదా మే లలో రెండు దశలలో ఏదైనా బోర్డు పరీక్షకు హాజరయ్యే అవకాశం లభిస్తుంది.

ఇంటర్నల్స్ ఒకసారే

ఈ గ్రేడ్ తరగతికి అంతర్గత మూల్యాంకనం (internal assessment) ఒక విద్యా సంవత్సరంలో ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఫిబ్రవరిలో సీబీఎస్ఈ ప్రకటించిన ముసాయిదా నిబంధనలను ప్రజల అభిప్రాయాల కోసం పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link