



Best Web Hosting Provider In India 2024

ఎల్లుండి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న అమిత్ షా
ఈ నెల 29న నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 29న నిజామాబాద్లో పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ బోర్డు ఏర్పాటు దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులకు ఒక చారిత్రక మైలురాయి అని, తెలంగాణకు గర్వకారణమైన క్షణం అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అభివర్ణించారు.
జూన్ 29న జరగనున్న భారీ కిసాన్ సభ కోసం నిజామాబాద్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కూడా అయిన కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ లోక్సభ సభ్యుడు ధర్మపురి అరవింద్, ఇతర పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు.
‘బోర్డు ప్రారంభం అనంతరం కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాతో పాటు ఇతర మంత్రులు, అధికారులతో కలిసి తదుపరి కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. పసుపు ధరలు పెరిగేలా, వ్యాల్యూ యాడెడ్ ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్కు గౌరవం పెరగాలన్నదే ఉద్దేశ్యం.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుచేయడం ప్రధాని మోదీ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి లభించిన ఒక అద్భుత బహుమతి..’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
‘మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వారి జీవితంలో చివరి దశలో బిజెపి కి దగ్గరయ్యారు. డీఎస్ ప్రథమ వర్థంతి జూన్ 29న జరగనుంది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ ధర్మపురి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. అమిత్ షా ఈ అభ్యర్థనను పెద్ద మనసుతో అంగీకరించారు. జూన్ 29న రైతు సభకు వెళ్లే క్రమంలో డి.శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది..’ అని వివరించారు.
టాపిక్