
Best Web Hosting Provider In India 2024

Congress Mlcs : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. రేపు ఉదయం 11 గంటలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉంది కాబట్టి రెండు ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారని ప్రచారం జరగగా, చివరకు మహేష్ కుమార్ గౌడ్ వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ట్రెండింగ్ వార్తలు
టాపిక్
Telangana CongressTelangana NewsTelangana Mlc ElectionsTelugu NewsTs Politics