Best Web Hosting Provider In India 2024
18 Jan 2024 10:39 PM

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల నాలుగవ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇప్పటికే 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను ప్రకటించాం.. అయితే, నాలుగవ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేసినట్లు మంత్రి తెలిపారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపిక చేసిన జాబితాను మంత్రి మీడియాకు వివరించారు.
- చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా(ఎంపీ) నారాయణస్వామి..
- జీడీ నెల్లూరు ఇన్ ఛార్జ్ గా- రెడ్డప్పా
- శింగనమల- ఎం వీరాంజనేయులు
- తిరువూరు- స్వామిదాస్
- మడకశిర -ఈర లక్కప్ప
- కొవ్వూరు – తలారి వెంకట్రావ్
- కనిగిరి – దద్దాళ నారాయణ యాదవ్
- గోపాలపురం – తానేటి వనిత
- నందికొట్కూరు – డా. సుధీర్ దారా