మీరు నడిపిన భూమాఫియాలానే ధర్మవరంలోనూ మీ మిత్రుడు చేశాడు – కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ ఫైర్

Best Web Hosting Provider In India 2024


Minister Satya Kumar Yadav On KTR : ఏపీ ఎన్నికల ఫలితాలతో పాటు ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై కేటీఆర్ చిలుక పలుకులు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు.

“ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియాలాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే. ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు” అంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

“మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విట్టర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి” అంటూ మంత్రి సత్య కుమార్ సెటైర్లు విసిరారు.

WhatsApp channel

టాపిక్

KtrAndhra Pradesh NewsTrending ApYs JaganBjp

Source / Credits

Best Web Hosting Provider In India 2024