తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – జూలై నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ – జూలై నెలలో జరిగే విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. జూలై మాసంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను వెల్లడించింది. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం, జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అప్డేట్ ఇచ్చింది. వచ్చే జూలై నెలలో జరిగే విశేష పర్వదినాల వివరాలను తెలిపింది. జూలై 10వ తేదీన గురు పౌర్ణమి గరుడసేవ ఉంటుంది. జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానంతో పాటు మరికొన్ని తేదీల్లో ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

జూలై నెలలో జరిగే కార్యక్రమాలు:

  • జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర.
  • జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.
  • జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
  • జూలై 10న గురు పౌర్ణమి గరుడసేవ.
  • జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం.
  • జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
  • జూలై 28న తిరుమల శ్రీవారు పురిశైవారి తోటకు వేంచేపు.
  • జూలై 29న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడసేవ.
  • జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి.

శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవాలు:

తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు శ్రీవారి సాక్షాత్కార వైభవోత్సవములు జరుగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసంది. ఈ సందర్భంగా జూన్ 26న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జూలై 03న పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

సాక్షాత్కార వైభవోత్సవం, పార్వేట ఉత్సవం సందర్భంగా జూన్ 26న, జూన్ 30 నుండి జూలై 03వ తేదీ వరకు నిత్య కళ్యాణోత్సవం రద్దు చేశారు. జూన్ 26 నుండి జూలై 03 వరకు తిరుప్పావడ సేవ, జూలై 02న అష్టోత్తర శతకలశాభిషేకం సేవలు రద్దు చేశారు. జూలై 01వ తేదీన స్వర్ణపుష్పార్చన రద్దు చేశారు. ఈ వివరాలను భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Andhra Pradesh NewsDevotionalTtdTirumala
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024