




Best Web Hosting Provider In India 2024

అమరావతిలో ‘క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ’ – 2026 జనవరి నాటికి ప్రారంభం
ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయబోయే క్వాంటం వ్యాలీపై రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ కీలక ప్రకటన చేశారు. 2026 జనవరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభమవుతుందని చెప్పారు.
అమరావతిలో 2026 జనవరి నాటికి మొదటి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. ఏపీతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న విద్య, వైద్యారోగ్యం, ఫార్మా, ఆగ్రిటెక్, మెడ్ టెక్ సంస్థలు… ఈ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ సేవలు వినియోగించుకోవచ్చన్నారు. ఆయా సంస్థలు పరిశోధలతో పాటు వివిధ పరిష్కారాలను క్వాంటం టెక్నాలజీ ద్వారా వెతుక్కునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏపీకి మాత్రమే పరిమితం కాదు….
సమీప భవిష్యత్తులో లక్షల మంది అమరావతి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ నుంచి పనిచేసేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వ్యాలీ సెంటర్ ఏపీ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాదన్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాలు, ప్రభుత్వాలు, సంస్థలు వినియోగించుకోవచ్చని వెల్లడించారు.
“మానవ సమాజానికి విస్తృతంగా ఈ క్వాంటం టెక్నాలజీ వినియోగించాలన్నదే మా లక్ష్యం. స్టార్టప్ లతో పాటు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కూడా క్వాంటం వ్యాలీ పార్క్ ద్వారా వస్తాయి. రాష్ట్రంలో అమల్లో ఉన్న వివిధ పాలసీలు పెట్టుబడులు, పరిశ్రమలు, సంస్థలు ఇక్కడికి వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఏపీలో యువతకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా నైపుణ్యాలు కూడా కల్పిస్తాం” అని కాటమనేని భాస్కర్ తెలిపారు.
“క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా ఉద్యోగాలు పోతాయి అన్నది అపోహ మాత్రమే. ఈ సాంకేతికత మానవులకు ప్రత్యామ్నాయం కాదు. సంప్రదాయ కంప్యూటర్లు యథాతథంగా కొనసాగాల్సిందే. మానవాళికి తక్కువ సమయంలో సాధ్యం కాని సమస్యల్ని , పరిశోధనల్ని సాధించేందుకు మాత్రమే క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ వినియోగం అవుతుంది” అని కాటమనేని భాస్కర్ వెల్లడించారు.
“ప్రపంచం మనకోసం ఆగటం లేదు. క్వాంటం వినియోగం పెరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకోవటమే మనం చేయాల్సింది. నేషనల్ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగానే అమరావతి క్వాంటం వ్యాలీ సెంటర్ పనిచేస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ ఉద్పాదక పెంచుతుంది. తద్వారా సంపద, సమృద్ధి సాధించే అవకాశం ఉంది” అని వివరించారు.
టాపిక్